శ్రీ జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమత్ బట్టు పల్లి పంచాయతీ బుద్ధారం గ్రామం లో అంగరంగ వైభవంగా  నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పినపాక శాసనసభ్యులు  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వామివారికి పంచామృత స్నానం చేయించి, పట్టువస్త్రాలు సమర్పించి లక్ష్మి నరసింహ స్వామి వారిని భక్తి భావంతో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచులు పోలేబోయిన శ్రీవాణి తిరుపతయ్య , తోలెం నాగేశ్వరరావు, మండల నాయకులు ఎర్ర సురేష్, గొగ్గలి రవి, భూక్య రాందాస్, షేక్ రఫీ, కొమరం వెంకటేశ్వర్లు, దెంచనల రాజేంద్ర ప్రసాద్, దుర్గం కన్నయ్య, కరకపల్లి నాగేష్ తదితరులు హాజరయ్యారు.

సర్పంచులు తోలెం రమాదేవి, కొమరం సుగుణ , చౌలం కేశవరావు , పోలేబోయిన సుజాత , ఎర్రం పొట్టయ్య, తోలెం రమేష్ , మరియు ఉప సర్పంచులు గాందర్ల రామనాథం, ఇర్రి వెంకన్న అర్చకులు నరసింహాచారి, ధర్మకర్త రవితేజ, కమిటీ సభ్యులు పోలబోయిన శంకరయ్య , మైపతి రంగారావు గారు, మైపతి శంకరరావు, సత్యనారాయణ, కొమరం నర్సింహులు, పాయం నరసింహారావు, పాయం సాంబయ్య, పోలేబోయిన నారాయణ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram