బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసు కుంది. ఇవాళ ఉదయం బీజాపూర్ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. మావోయి స్టుల కోసం డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌ బృందాలు గాలిం పు కొనసాగిస్తున్నాయి.

ఈ ఆపరేషన్ లో DRG,STF, మరియు బస్తార్ ఫైటర్ సైనికులు పాల్గొన్నారు.పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram