టిఆర్ఎస్ ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు: కవిత

 

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు. తమ పార్టీ ఆచార్య జయశంకర్‌ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందన్నారు. తమ పార్టీకి బిహార్‌ సిద్ధాంతకర్త ఎవరూ లేరన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram