మరిపెడలో విషాదం.. మూడేళ్ల బాలుడు మృతి
గోల్డెన్ న్యూస్ /మరిపెడ /మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జ్వరంతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడు చికిత్స అనంతరం మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆర్ఎంపీ నిర్లక్ష్య వైద్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం క్లినిక్ కు తాళం వేసి వెళ్లిపోయిన ఆర్ఎంపీ పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి కుటుంబ సభ్యులు కోరారు.
Post Views: 24









