హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను.. పదవి నుంచి తొలగించండి

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్/  లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలంటూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంక్‌ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram