నేడు చెన్నై పర్యటనకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థుల కుటుంబాలను ఆయన నేరుగా కలిసి పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులకు భరోసా ఇవ్వడంతో పాటు విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాహుల్ మాట్లాడనున్నారు.
Post Views: 32









