అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి. సీపీఎం

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నిమ్మల వెంకన్న అన్నారు. మండల కార్యదర్శి కొమరం కాంతారావు అధ్యక్షతన బుధవారం జరిగిన  ప్రజా ప్రదర్శన ధర్నా లో ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న పాల్గొని   తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి. డిప్యూటీ తాసిల్దార్ కు తిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిమ్మల వెంకన్న మాట్లాడుతూ.. కరక గూడెం మండలంలో అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు.మండలంలో మిగిలిపోయిన పోడు రైతులకు హక్కు పత్రాలు ఇచ్చి త్రీఫేస్ కరెంట్ వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కొత్త రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ పెన్షన్లు, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 రూపాయలు గ్యాస్ సబ్సిడీ రైతులకు రుణమాఫీ రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేవడుతామని అవసరమైతే ప్రభుత్వ కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిక చేశారు. అదేవిధంగా గత 40 సంవత్సరాల నుండి ఛత్తీస్ ఘడ్ నుండి వచ్చిన ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వలన ఆదివాసీల  పిల్లలు చదువులు ఆగిపోవడం జరుగుతుందని అదేవిధంగా సర్టిఫికెట్ లేకపోవడం వలన పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు వెంటనే కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి, అధికారులకు సూచన చేశారు ఈ కార్యక్రమంలో  పార్టీ మండల  కమిటీ సభ్యులు చర్ప సత్యం, కనితి రాము, పద్దం బాబురావు, శోభారాణి, లక్ష్మయ్య, పదం సత్యం, రమాదేవి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram