బస్సులో బాధితుడు పోగొట్టుకున్న నగదును అప్పగించి మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, నిజాయితీని చాటుకున్నారు.
గోల్డ్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : బస్సులో బాధితుడు పోగొట్టుకున్న నగదును అప్పగించి మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, నిజాయితీని చాటుకున్నారు. మణుగూరు డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఇల్లటూరి మహేష్ మంగళవారం మణుగూరు నుండి అమలాపురం డ్యూటీకి వెళ్లి తిరిగి మణుగూరు డిపో కి బయలుదేరి వస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న అశ్వరావుపేటకు చెందిన ప్యాసింజర్ లక్ష రూపాయలు నగదు ఉన్నటువంటి పర్సు బస్సులో పడిపోవడంతో, ఈ విషయాన్ని బాధితుడు ఆర్టీసీ అధికారులకు తెలియజేయడంతో మహేష్ బస్సులో తనిఖీ చేయగా దొరికిన పర్సును గమనించిన డ్రైవర్ మహేష్ దానిలో లక్ష రూపాయలు నగదు ఉండడంతో వాటిని మణుగూరు డిపోసెక్యూరిటీ అధికారులకు అప్పగించాడు. బుధవారం ఉదయం బాధితుడికి లక్ష రూపాయలు అందజేసిన ఆర్టీసీ అధికారులు. పోగొట్టుకున్న లక్ష రూపాయలను తిరిగి ప్యాసింజర్ కు అందజేసిన డ్రైవర్ మహేష్ ని, ప్యాసింజర్, మరియు ఆర్టీసీ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.