ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుణ్ని హత్య చేసిన ప్రియురాలు

ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుణ్ని హత్య చేసిన ప్రియురాలు

 

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పుర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడన్న కోపంతో ఓ యువతి తన ప్రియుడిని కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన బిలాస్‌పుర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

 

ప్రసాద్ సూర్యవంశీ (25) అనే యువకుడు స్థానిక శుభమ్ విహార్ టీచర్స్ కాలనీలో అద్దెకు నివాసం ఉంటూ హోటల్‌లో పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. సోషల్ మీడియా ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.

 

ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో యువకుడు యువతి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి అతడిని కలిసేందుకు వెళ్లి వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో కత్తితో దాడి చేయడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందిత యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram